హైద‌రాబాద్‌లో విషాదం.. ఎనిమిదో త‌ర‌గతి విద్యార్థి ఆత్మ‌హ‌త్య

-

హైద‌రాబాద్ న‌గ‌రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి 14 వ అంత‌స్థు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని శేరిలింగంప‌ల్లిలో గ‌ల అప‌ర్ణ స‌రోవ‌ర్ భ‌వనంలో జ‌రిగింది. అద్వైత్ (13) ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అయితే అద్వైత్ స‌రిగా చ‌ద‌వ‌డం లేద‌ని తండ్రి మంద‌లించాడు. దీంతో అద్వైత్ మ‌న‌స్థాపానికి గురి అయ్యాడు. తండ్రి మంద‌లించాడ‌నే బాధ‌తో అద్వైత్ అప‌ర్ణ స‌రోవ‌ర్ భ‌వ‌నంలోని 14 వ అంత‌స్థు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

కాగ ప్ర‌స్తుతం కరోనా వ్యాప్తి కార‌ణంగా.. విద్యా సంస్థ‌లు మూత ప‌డ్డాయి. దీంతో విద్యార్థుల‌కు ఉపాద్యాయులు ఆన్ లైన్ లో క్లాసులు చెబుతున్నారు. అయితే అద్వైత్ ఆన్ లైన్ క్లాస్ ల‌ను చూడ‌క‌పోవ‌డం తో పాటు స‌రిగ చ‌ద‌వ‌క పోవడంతో తండ్రి మంద‌లించాడ‌ని తెలుస్తుంది. దీంతో మ‌న‌స్థాపానికి గురి అయి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఒక్క గాను ఒక కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం తో అద్వైత్ త‌ల్లి దండ్రులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news