తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ లోనే మృతి

-

 

తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు… స్పాట్ లోనే మృతి చెందారు. వికారాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఏకంగా నలుగురు మృతి చెందారు. పరిగి మండలం రంగాపూర్ సమీపంలో బీజాపూర్- హైదరాబాద్ హైవేపై ఆగి ఉన్న లారీని ఓ పెళ్లి బస్సు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో… బస్సులో ఉన్న వారు మృతి చెందారు.

Fatal road accident in Telangana.. Four people died on the spot
Fatal road accident in Telangana.. Four people died on the spot

మొత్తం నలుగురు మృతి చెందగా మరో 25 మందికి తీవ్ర గాయాలు అయినట్లు చెబుతున్నారు. ఇందులో ఆరుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం అందుతుంది. ఈ లారీ – బస్సు ప్రమాదంలో… గాయపడ్డ వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిగి లోని ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news