HYD : రూ.6 కోట్ల బంగారు నగలు చోరీ.. వారిపైనే అనుమానం!

-

హైదరాబాద్‌ నడిబొడ్డున భారీ దొంగతనం జరిగింది. బంజారాహిల్స్‌లోని శ్రీకృష్ణ జ్యువెలర్ షాప్‌లో రూ.6కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. అసలు గ్రహించిన యాజమాన్యం చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జ్యువెల్లరీ షాపులోని ఆభరణాల వివరాలను సేకరించారు.

వెంటనే ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేసి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, చోరీ జరిగాక జువెల్లరీ షాప్ మేనేజర్ సుకేతు షా ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. దీంతో పాటు అతడి ఫొన్ నంబర్ కూడా స్విచ్ఛాప్ రావడంతో యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా అతనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు మేనేజర్ మీద మిస్సింగ్ కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news