ప్రాణాలు తీసిన మూఢ న‌మ్మ‌కం.. మంత్రాల నెపంతో ముగ్గురి హ‌త్య

-

స‌మాజం ఆధునిక నాగ‌రిక‌త వైపు అడుగులు వెస్తున్నా.. ప‌ల్లెలను మూఢ న‌మ్మ‌కాలు ప‌ట్టి పీడిస్తున్నాయి. మంత్రాలు చేస్తున్నార‌ని ఒకే ఇంటికి చెందిన ఒక తండ్రి, ఇద్ద‌రు కుమారుల‌ను కొంత మంది అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. అందరూ చేస్తుండ‌గా.. న‌డి రోడ్డు పైనా ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. ఈ విషాద ఘ‌ట‌న జిగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. జ‌గిత్యాల లోని ఎరుక‌ల వాడ‌లో జ‌గ‌న్నాథం నాగేశ్వ‌ర్ రావు (60) నివాసం ఉంటున్నాడు. అత‌నికి రాంబాబు (35), ర‌మేశ్ (25), రాజేశ్ ముగ్గురు కుమారులు.

అయితే గురు వారం వీరి కుల సంఘం స‌మావేశం అయింది. నాగేశ్వ‌ర్ రావు త‌న ముగ్గురు కుమారుల‌తో కుల సంఘం స‌మావేశానికి వ‌చ్చాడు. అప్ప‌టికే ప్రణాళిక తో ఉన్న కొంత మంది నాగేశ్వ‌ర్ రావు మంత్రాలు చేస్తున్నావు అంటూ అరోపిస్తు.. ఆయ‌న‌ క‌ళ్ల ముందే త‌న ముగ్గురు కుమారుల‌పై క‌త్తుల‌తో దాడి చేశారు. మూడో కుమారుడు తీవ్ర గాయాల‌తో త‌ప్పించుకున్నాడు. దీంతో అక్క‌డ ఉన్న నాగేశ్వ‌ర్ రావు, అత‌ని కుమారులు రాంబాబు, ర‌మేశ్ ల‌పై విచ‌క్ష‌ణ రాహిత్యంగా క‌త్తుల‌తో దాడులు చేశారు.

దీంతో ఈ ముగ్గురు ప్రాణాలు విడిచారు. స‌మాచారం తెలుసుకుని ఘ‌ట‌నా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. హ‌త్య కు ఉప‌యోగించిన ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాగేశ్వ‌ర్ రావు కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్నారు. ఈ హ‌త్య‌లో మొత్తం ఆరుగురు పాల్గొన్నార‌ని పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news