శుభకార్యంలో విషాదం.. ఈత‌కు వెళ్లి ముగ్గురు మృతి

-

శుభ‌కార్యానికి వెళ్లిన వారు.. న‌దిలో ఈత కోసం దిగారు. దీంతో ముగ్గురు న‌దిలో గ‌ల్లంతు అయ్యారు. తీర చూస్తే.. ఆ ముగ్గురు కూడా మృతి చెందారు. ఈ విషాదక‌ర ఘ‌టన ఆంధ్ర ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లాలో ఐన‌వోలు లో చోటు చేసుకుంది. నూజెండ్ల మండ‌లంలో గ‌ల వినుకొండ గ్రామంలో ఓ శుభ‌కార్యానికి ఒక కుటుంబం వ‌చ్చింది. కాగ ఐన‌వోలు గ్రామంలోనే గుండ్ల క‌మ్మ అనే న‌ది ప్ర‌వ‌హిస్తుంది. కాగ ఈ న‌దిలో ఈత కోసం కొంత మంది వెళ్లారు.

న‌దిలో ఈత చేస్తుండగా.. ప్ర‌మాద‌వ శాత్తు ముగ్గురు గ‌ల్లంతు అయ్యారు. కుటుంబ స‌భ్యులు వ‌చ్చి న‌దిలో గాలించ‌గా.. ఆ ముగ్గురు మృతి చెందారు. ఆ ముగ్గురిలో ఒకరు యువ‌కుడు, ఇద్ద‌రు యువ‌తులు ఉన్నారు. వారు ఆయేషా సిద్ధికా (19), హీనా (22), ఫీజుల్లా ఖాన్ (19). కాగ ఈ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వార‌ని తెలుస్తోంది. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news