ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం…. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య

-

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది.  ప్రయాగ్ రాజ్ జిల్లాలో కేవ్ రాజ్ పూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దుండగులు క్రూరంగా హత్యచేశారు. పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలో  సామూహిక హత్యలు జరగడంతో ఆ ప్రాంత వాసుల్లో కలకలం రేపింది. హత్య అనంతరం దుండగులు ఇంటికి నిప్పు పెట్టారు. మంటలను గమనించి స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా… ఐదురుగురు హత్య చేయబడి ఉన్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి హుటాహుటిన పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలంలో విచారణ చేపట్టారు. బయట నిద్రిస్తున్న క్రమంలో ఈ దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. హత్యలకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రయాగ్ రాజ్ జిల్లాలో జరిగిన సామూహిక హత్యలు లాగే గత వారం నవాబ్ గంజ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల్ని దారుణంగా హత్య చేశారు.

 

 

.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version