బాల్ తగిలింది అని తుపాకీతో కాల్చేశాడు..!

-

క్రికెట్ ఆడేటప్పుడు బంటి తగిలిందని 12 యేళ్ళ బాలుడిపై తుపాకీ తో కాల్చిన సంఘటన ఉత్తరాఖండ్ లోని టెహ్రి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ జిల్లాలో జిల్లాలోని భేటి గ్రామంలో గురువారం పిల్లలు క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి ఆ సమీపంలోనే కూర్చుని ఉన్న రాంలాల్, మరియు బీజేంద్ర కందారి అనే వారికి తగిలింది. బంతిని తీసుకురావడానికి వారి వద్దకు వెళ్లిన మహేష్ పై మద్యం మత్తు లో,

ఉన్న రాంలల్ పక్కనే ఉన్న బీజేంద్ర కందారి నుంచి నాటు తుపాకీ తీసుకుని నిర్దాక్షణ్యంగా ఆ బాలుని పై కాల్పులు జరిపాడు. మహేష్ కు కుడి కన్ను కింద తుపాకీ గాయం అయింది. అక్కడే ఉన్న మరికొంత మంది గ్రామస్తులు అప్రమత్తమై వెంటనే ఆ బాలుడిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

అక్కడ ప్రధమ చికిత్స చేశాక అక్కడి నుంచి రిషికేశ్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాంలాల్, మరియు బీజేంద్ర కందారీ పై కేసు నమోదు చేసి నిందితులు ఇరువురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకోవడం జరిగింది అని ఘన్సాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ప్రదీప్ సింగ్ రావత్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news