భార్యా భర్తలు గొడవ పడి ఇంటి ఓనర్ ని చంపేశారు…!

-

కొన్ని కొన్ని దరిద్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చెప్పుకుంటే చండాలం వింటే రోత అన్నట్టు ఉంటుంది. తాజాగా జరిగిన ఘటనలో ఇంటి ఓనర్ ప్రాణాలు కోల్పోయిన విధానం చూస్తే పాపం కాదు గాని అంతకంటే ఎక్కువే అనిపిస్తుంది. అసలు ఎం జరిగిందో ఈ స్టొరీలో చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో ఒక వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. అంత వరకు బాగానే ఉంది.

అద్దెకు తీసుకున్న భార్యా భర్తలు ఇద్దరూ రాత్రి సమయంలో గొడవ పడుతున్నారు. ఆ సమయంలో సరిగా ఇల్లు అద్దెకు ఇచ్చిన వ్యక్తి ఫ్యామిలీ తో కలిసి నచ్చిన సీరియల్ చూస్తున్నాడు. అయితే భార్యా భర్తల అరుపులకు సీరియల్ సౌండ్ వినపడటం లేదు. దీనితో ఇంటి ఓనర్ భార్య, సౌండ్ పెంచండి అనగానే కాస్త సౌండ్ పెంచాడు. అయినా సరే గొడవ వినపడుతూనే ఉంది. తప్పక అలాగే సీరియల్ చూస్తున్నాడు.

మేము గొడవపడి ఇబ్బంది పడుతుంటే ఆపాల్సింది పోయి సీరియల్ సౌండ్ పెట్టుకుని చూస్తాడా అంటూ అద్దెకు తీసుకున్న వ్యక్తి భార్యతో గొడవ ఆపి అక్కడికి వెళ్ళాడు. సీరియల్ సౌండ్ తగ్గించమన్నాడు. మీరు గొడవపడుతున్నారు నాకు వినపడటం లేదన్నాడు ఒంటి ఓనర్. తల మీద బలంగా కొట్టడంతో ఇంటి ఓనర్ కింద పడిపోయాడు. వెంటనే ఓనర్, భార్య సహాయంతో కొట్టిన వ్యక్తి ఆస్పత్రికి తీసుకువెళ్ళాడు.

డాక్టర్లు అతన్ని పరీక్షించి చనిపోయాడు అని చెప్పారు. దీనితో అద్దెకు తీసుకున్న వ్యక్తి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. దీనితో భార్య బోరుమంది. భార్యా భర్తల గొడవ ఇంటి ఓనర్ ప్రాణాలు తీసింది అన్న విషయం పోలీసులకు తెలిసింది. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసుకుని కొట్టిన వ్యక్తి కోసం వెతుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news