తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి చెందింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో ఈ ఘటన జరిగింది. ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22)తో తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్నారు మధుమతి తల్లిదండ్రులు. ప్రతాప్ ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.