సీయూఈటీ (యూజీ) దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు

-

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ – యూజీ పరీక్షకు దరఖాస్తుల గడువు షెడ్యూల్‌ ప్రకారం నేటితో ముగియనుంది. తాజాగా అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది.

ఇంతకుముందు మార్చి 26తో దరఖాస్తుల గడువు ముగియగా.. ఇటీవల మార్చి 31 వరకు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి దరఖాస్తుల సమర్పణకు గడువు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏప్రిల్‌ 5వ తేదీ రాత్రి 9.50గంటల వరకు అభ్యర్థులు https://exams.nta.ac.in/CUET-UG/ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.ఈ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నారు.తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో సీయూఈటీ యూజీ పరీక్షను హైబ్రిడ్‌ పద్ధతి (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌)లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో జరగనుంది.జూన్‌ 30న రిజల్ట్స్ ను విడుదల చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version