దారుణం : అక్కాచెల్లెళ్లని చంపి చెరువులో పడేశారు

-

మహిళల రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజూ ఎక్కడో ఒక చోట వారి మీద దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ జిల్లాలోని అసోధర్ ప్రాంతంలోని ఒక గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చెరువులో పడి చనిపోయి ఉన్నారు. ఈ ఇద్దరు మైనర్లు కాగా వీరిని ఎవరో చంపారని భావిస్తున్నారు. ఈ ఇద్దరి కళ్ళలో గాయం గుర్తులున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంటి నుండి బయటకి వెళ్ళి కనిపించకుండా పోయిన బాధితుల మృతదేహాలను సాయంత్రం ఆలస్యంగా చెరువు నుంచి వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు.

దళితుడైన దిలీప్ ధోబి కుమార్తెలు సుమి (12), కిరణ్ (8) మృతదేహాలను చెరువు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎఎస్‌పి రాజేష్ కుమార్ తెలిపారు. ఈ రెండు మృతదేహాల కళ్ళలో గాయం గుర్తులు ఉన్నాయని ఆయన చెప్పారు. బాలికలు కూరగాయలు తీసుకోవడానికి మధ్యాహ్నం పొలానికి వెళ్లినప్పటి నుండి తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. బాలికలపై అత్యాచారం చేయడానికి విఫల ప్రయత్నం చేసిన తరువాత దుండగులు బాలికలను చంపారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news