దాసరి ఇంట్లో వివాదం..

-

దర్శకరత్న, దివంగత దాసరి నారాయణ రావు ఇంట్లో వివాదం రాజుకుంది. ఆయన పెద్ద కోడలు సుశీల సోమవారం సాయంత్రం దాసరి నివాసం ఎదుట నిరసకు దిగారు. తనకు, తన కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాసరి చిన్న కుమారుడు అరుణ్, ఆయన భార్య తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ..తన భర్తను డమ్మీగా చేసి ఆడిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 1955 లో దాసరి పెద్ద కుమారుడు తారక్ ప్రభుతో వివాహం జరిగింది..దీంతో తమకు పంజగుట్టలో వేరు కాపురం పెట్టాంచారు. ఆ తర్వాత నెలకొన్న కారణాల వల్ల దాసరి కుటుంబ సభ్యులు భర్తతో విడాకులు తీసుకోమని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నేళ్లు మామ గౌరవం కోసమే బయటకు రాలేదని ఆమె చెప్పారు. గతంలో మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారన్నారు. కానీ ప్రస్తుతం వాళ్లు తమకు ఏమి పట్టనట్లు వ్యవహరించడం చాలా బాధగా ఉందన్నారు. తన కుమారుడ్ని హీరో చేస్తానని, ఆస్తిలో సగ భాగం ఇస్తానని దాసరి తనకు హామి ఇచ్చినట్లు  ఆమె పేర్కొన్నారు. తన భార్తతో నే కలిసి ఉంటానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version