అవినీతి గురించి బీజేపీకి మాట్లాడే హక్కు లేదు : దాసోజు శ్రవణ్‌

-

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారని ఆయ‌న తెలిపారు. సినిమాలో హీరో నటించినట్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ధర్నా పేరుతో కిషన్ రెడ్డి నటించారని.. మణిపూర్ మండుతుంటే కిష‌న్ రెడ్డి తెలంగాణ‌లో సంబ‌రాలు చేసుకుంటున్నార‌ని ఆరోపించారు. రెండు తెగల మధ్య పంచాయతీ పెట్టి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ చోద్యం చూస్తోందని.. మహిళలను వివస్త్రను చేసి పరేడ్ చేపిస్తున్నారని శ్ర‌వ‌ణ్ ఆరోపించారు.

అవినీతి గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను దేశానికి ఎందుకు తిరిగి తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. బీజేపీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తోందన్నారు. విమానాశ్రయాలను అదానీకి కట్టబెట్టారన్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే తన సొంత పార్టీ బీజేపీలోని సమస్యలను పరిష్కరించుకుంటాడని తాను భావించానని, కానీ ఇళ్లు సదురుకోకుండానే మా మీద పడ్డారన్నారు. ముందు మీ ఇల్లు చక్క దిద్దుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలను ఆదుకునే దేవుడిలా కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version