హీరో నాగార్జున పొలంలో ఓ మృత దేహం.. షాక్ ఇచ్చిన క్రైమ్ న్యూస్..?

-

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సినీ రంగ ప్రముఖులందరికీ పొలాలుస్థలాలు ఉన్న విషయం తెలిసిందే.. ఆ స్థలాల్లో కొందరు వ్యవసాయం కూడా చేయిస్తున్నారుమరికొందరు గెస్ట్ హౌజులు కట్టుకున్నారుహీరో నాగార్జునకు కూడా షాద్ నగర్ మండలం పాపిరెడ్డి గూడాలో ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది.

ఇటీవల నాగార్జున ఆ వ్యవసయా క్షేత్రంలో సెంద్రీయ వ్యవసాయం చేయించాలనుకున్నారుఅందుకు సంబంధించిన నిపుణులను ఆ వ్యవసాయ క్షేత్రానికి పంపించారుఅయితే అక్కడ కనిపించిన ఓ దృశ్యం చూసి వారు షాక్ అయ్యారుఎందుకంటే..ఆ పొలంలో ఓ మృత దేహం ఉందిఅది కూడా బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉందిఎముకల గూడులా మారిపోయింది.

పొలంలో డెడ్ బాడీని చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారటవారు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారుమృతదేహం మరీ కుళ్లిపోయి ఉండటంతో అక్కడే పోస్టు మార్టం కూడా నిర్వహించారటనాగార్జున పొలంలో మృత దేహం దొరికిందన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ మృత దేహం ఎవరిది.. అక్కడ ఎందుకు ఉంది.. మారుమూల ప్రాంతం కావడంతో అక్కడకు తీసుకొచ్చి పడేశారా.. అసలు చనిపోయింది ఎవరు.. చంపింది ఎవరు.. ఎవరైనా చంపారా లేక.. ఆ వ్యక్తే ఆత్మహత్య చేసుకున్నారా.. ఇవన్నీ ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయిక్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపిస్తున్న ఈ విషయంలో అసలు నిజాలు బయటపడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news