Breaking news : మాజీ మంత్రి కుతూహలమ్మ మృతి

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తిరుపతిలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్‌ తరఫున చిత్తూరు జెడ్పీ చైర్ పర్సన్ గా రాజకీయ జీవితం ఆరంభించారు. చాలా కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. 1985లో వేపంజేరి (ప్రస్తుతం జీడీనెల్లూరు) నియోజకవర్గం నుంచి గుమ్మడి కుతూహలమ్మ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గానూ పని చేశారు. 1994లో కాంగ్రెస్‌ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

2009లో జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో కుతూహలమ్మ మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయారు. 2021లో టీడీపీకి రాజీనామా చేశారు.నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో కుతూహలమ్మ మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయారు. 2021లో టీడీపీకి రాజీనామా చేశారు. కుతూహలమ్మ జీవితం ఎందరో మహిళలకు ఆదర్శనీయంగా నిలిచింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version