అమరావతిలో1800 ఎకరాల సేకరణకు నిర్ణయం..!

-

 

అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే 32 వేల ఎకరాల భూమిని సమీకరించింది. అయితే ఆయా భూముల మధ్యలో ఉన్న 1,800 ఎకరాల భూమిని ఇచ్చేందుకు 80 మంది రైతులు నిరాకరించారు. దీంతో నిర్మాణాలకు ఇబ్బంది కలిగేలా ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Flats will be given to farmers who gave land for the capital Amaravati
Flats will be given to farmers who gave land for the capital Amaravati

తాజాగా ఆ భూములను సేకరించాలని CRDA నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ కూలింగ్ కింద అప్పగించాలని కోరినప్పటికీ రైతులు అంగీకరించకపోవడంతో ల్యాండ్ అక్విజిషన్  చేయాలని డిసైడ్ అయింది. ఈ విషయం పైన వైసిపి పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఇక అటు ఏపీలో ఇంకా మిగిలిన మొత్తం 432 బార్లకు రీనోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో 432 ఓపెన్‌ కేటగిరీ బార్లు మరియు 4 రిజర్వ్‌ కేటగిరీ బార్లు ఉన్నాయి. సెప్టెంబర్‌ 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 15 ఉదయం 8 గంటలకు లక్కీడ్రా నిర్వహిస్తారు. ఏపీలో బార్లను తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news