డ్రగ్స్ కేసు : కన్నీళ్లు పెట్టుకున్న దీపిక..?

-

బాలీవుడ్ లో తెర మీదికి వచ్చి సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో సరికొత్త పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న శ్రద్ధాకపూర్, సారా అలీ ఖాన్, దీపికా పదుకొనే, రకుల్ లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల నుంచి నోటీసులు అందడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్లు అందరూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణకు హాజరు అవుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇటీవల దీపికా పదుకొనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నారు హీరోయిన్ దీపికా పదుకొనే. సుశాంత్ మేనేజర్ తో తాను చాటింగ్ చేసిన మాట వాస్తవమేనని.. కానీ తాను ఇప్పటి వరకు డ్రగ్స్ తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. కాగా సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు అంటూ… ఇప్పటికే విచారణకు హాజరైన ఇద్దరు హీరోయిన్లు ఎన్సీబీ అధికారుల ముందు చెప్పడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే

Read more RELATED
Recommended to you

Exit mobile version