బెయిల్‌ వచ్చిన…ఆ రోజు వరకు జైల్లోనే ఢిల్లీ సీఎం

-

ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు భారీ ఝలక్ ఇచ్చింది.సీఎం కేజ్రీవాల్‌కు ట్రయిల్ కోర్టు ఇచ్చిన సాధారణ బెయిల్‌ ఆదేశాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. కేజ్రీవాల్ బెయిల్‌పై మంగళవారం తుది నిర్ణయం తీసుకుంటామని ,అప్పటి వరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తీహార్ జైలులోనే ఉండాలని ఈ మేరకు జస్టిస్ సతీశ్ కుమార్ జైన్ శుక్రవారం తన ఆదేశాల్లో స్పష్టం చేశారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ట్రయిల్ కోర్టు గురువారం సాధారణ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే .ట్రయిల్ కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version