త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన : సీఎం చంద్రబాబు

-

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈరోజు (శుక్రవారం) భేటీ అయ్యారు.బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగ కుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతిభద్రతలు తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు అన్నారు .మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా.. జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు.ఈపూరుపాలెం ఘటనలో దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతరం సచివాలయం నుంచి ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version