ఐపీఎల్ 19వ మ్యాచ్‌.. బెంగళూరు టార్గెట్ 197..

-

దుబాయ్‌లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 19వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 196 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. మ్యాచ్‌లో బెంగ‌ళూరు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ బ్యాటింగ్ చేప‌ట్టింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి ఆ జ‌ట్టు 196 ప‌రుగులు చేసింది.

ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో మార్క‌స్ స్టాయినిస్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 53 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే పృథ్వీ షా 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 42 ప‌రుగులు చేశాడు. మ‌రో ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్లు శిఖ‌ర్ ధావ‌న్ (32 ప‌రుగులు, 3 ఫోర్లు), రిష‌బ్ పంత్ (37 ప‌రుగులు, 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)లు కూడా రాణించారు. దీంతో ఢిల్లీ భారీ స్కోరు చేయ‌గలిగింది. ఇక బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ 2 వికెట్లు తీయ‌గా, మొయిన్ అలీ, ఉదానాల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version