రిజర్వేషన్ల రద్దుపై అమిత్‌ షా ఫేక్ వీడియో.. దిల్లీలో కేసు నమోదు

-

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేరిట వైరలవుతున్న కొన్ని ఫేక్ వీడియోలపై దిల్లీ పోలీసులు ఆదివారం రోజున కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విషయంలో త్వరలో దేశవ్యాప్తంగా అరెస్టులు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. సదరు వీడియోలను షేర్‌ చేసిన వారిని అదుపులోకి తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఎడిట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో ఎంహెచ్‌ఏ పేర్కొంది. వీడియోలను ఎక్కడి నుంచి షేర్‌ చేశారో తెలియజేసే కొన్ని లింకులను కూడా జత చేసినట్లు తెలిపింది.

అసలేం జరిగిందంటే..?

అమిత్‌ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొని బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని తెలిపారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్‌ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫేక్ వీడియోలు వైరల్ కావటంతో కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news