స్విగ్గీలో డ్రగ్స్ డెలివరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు

-

నగరంలో డ్రగ్స్అమ్మడానికి వచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్ ని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మురళీధరన్ అనే వ్యక్తి బెంగళూర్ లో స్విగ్గీ బాయ్ గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంతో హైదరాబాద్ లోని కస్టమర్లకు ఎండీఎంఏ డ్రగ్ను అమ్మడానికి శంషాబాద్ వచ్చాడు. ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఎస్వోటీ , ఆర్జీఐ పోలీసులు అతడిని పట్టుకుని సోదా చేశారు. అతని ప్యాంటు ఇన్నర్ జేబులో దొరికిన 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news