జ్యోతిష్యంలో రత్నాలు గ్రహాల శక్తిని బలోపేతం చేసి జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తాయని కొందరికి నమ్మకం. అలాగని అన్ని రత్నాలు పెట్టుకోకూడదు.జీవితం లో మార్పు కోసం రత్నాల్లో పగడం (రెడ్ కోరల్) ప్రత్యేకమైనది. ఇది అంగారకుడు,కుజుడు చెందిన రత్నం. ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తి, విజయాలు తెచ్చిపెడుతుంది. జాతకంలో కుజుడు బలహీనంగా లేదా అశుభ స్థితిలో ఉంటే, పగడం ధరించడం వల్ల జీవితం మారే అవకాశం ఉంది. ఆర్థికం, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితంలో మెరుగుదల వస్తుంది. అయితే, జాతకం పరీక్షించకుండా ధరించకూడదు. ఇప్పుడు ఏ రాశులవారికి ఇది ఎక్కువ శుభకరమో చూద్దాం.
పగడం శక్తి ఏమిటి?: పగడం అంగారక గ్రహానికి ప్రతినిధి. ఇది ధైర్యం, సాహసం, శారీరక బలం పెంచుతుంది. రక్త సంబంధిత సమస్యలు, భయాలు, ఆత్మవిశ్వాస లోపం తగ్గుతాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో పురోగతి, వివాహ జీవితంలో సామరస్యం వస్తాయి.
ఏ రాశులకు అత్యంత శుభం?: మేషం, వృశ్చికం రాశులకు పగడం అత్యంత శుభప్రదం. ఈ రెండు రాశులకు కుజుడే అధిపతి కాబట్టి, పగడం ధరిస్తే జాతక బలం పెరిగి, జీవితం తిరుగుతుంది. సింహం, ధనుస్సు, మకరం రాశులవారికి కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశులవారి జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే, పగడం ధరించడం వల్ల అదృష్టం తలుపు తట్టవచ్చు.

ఎలా ధరించాలి?: ఈ పగడం ఉంగరం ను మంగళవారం ఉదయం ధరించాలి. ఎడమ చేతి చూపుడు వేలికి ధరించడం శుభం. కనీసం 6-8 బరువు ఉండాలి. ధరించే ముందు పండితుడిని సంప్రదించి, జాతకం చూపించి తీసుకోవాలి. తామర రంగు దారంతో ధరిస్తే మరింత మంచిది.
ఈ రాశీ వారికి: పగడం ధరించడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృశ్చికం రాశులవారు ప్రయత్నించవచ్చు. ఇది ధైర్యం, విజయం తెచ్చిపెడుతుంది. మీ జాతకం పరిశీలించి, సరైన సమయంలో ధరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
పగడం ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యం చెబుతుంది కానీ, ఇది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ధరించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగహన కోసం మాత్రమే, ఇది వ్యక్తిగత విశ్వాసం మీద ఆధారపడివుంటుంది.
