“జ్యోతి – ఈనాడు” వేస్ట్.. “యనమల – ఉమ” బెస్ట్!

-

తెలుగు దేశం పార్టీకి బలం.. నందమూరి తారకరామారావు ఏర్పాటుచేసిన గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల బలం అని అంటారు! చంద్రబాబుకు బలం ఆయన ఏర్పాటు చేసుకున్న పసుపు మీడియా అని అంటారు! అయితే ఈ విషయంలో జగన్ హస్తిన పర్యటనకు సంబందించి ఆ రెండు పత్రికలు చంద్రబాబుకు దెబ్బకొట్టాయని అంటున్నారు బాబు అభిమానులు!

అవును… జగన్ హస్తినకు వెళ్తే చాలు అది కేసుల కోసమే అని రాయాలనేది బాబు ఆలోచన! రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర సమస్యల గురించి చర్చించినా కూడా తనపై ఉన్న కేసుల గురించి కాళ్లు పట్టుకున్నారన్న రేంజ్ లో రాయలన్నది ఆయన కోరిక! అమిత్ షా తో జగన్ భేటీ విషయంలో న్యాయం చేసిన ఈ రెండు పత్రికలు… మోడీతో భేటీ విషయంలో బాబుకు అన్యాయమే చేశాయి!

“జీఎస్టీ బ‌కాయిల గురించి బుజ్జ‌గించ‌డానికి జ‌గ‌న్ ను ఢిల్లీకి పిలిపించార‌ట‌” అని ఆంధ్రజ్యోతి రాసుకొస్తే… “రాష్ట్ర స‌మ‌స్య‌ల గురించి మాత్ర‌మే వారి స‌మావేశం జ‌రిగింది” అని ఈనాడు రాసుకొచ్చింది! కానీ… టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ మాత్రం… బాబు ఆశించినట్లుగానే మైకుల ముందు మాట్లాడారు!

ముందుగా మైకందుకున్న యనమల రామకృష్ణుడు… తన కేసులపై కోర్టులు రోజువారీ విచారణ ప్రారంభిస్తే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు! ఇక అనంతరం మైకులముందుకొచ్చిన దేవినేని ఉమ… సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లింది కేసుల కోసమే అని చెప్పుకొచ్చారు! దీంతో.. ఈనాడు – జ్యోతి కంటే… యనమల – ఉమ లే బెస్ట్ అని అంటున్నారట చంద్రబాబు & ఆయన అభిమానులు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version