బాబుకి ఏపీ డీజీపీ కౌంటర్.. ఈ సారి అలా పంపండి !

-

న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి జరిగిన తరువాత ఆ దాడి చేసింది వైసిపి నేతలేనని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు ఏపి డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈలేఖపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో సీనియర్ అయిన మీరు నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా బహిరంగ లేఖలు రాయడం సరికాదని డీజీపీ చంద్రబాబుకు లేఖ రాశారు.

మీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, సీల్డ్ కవర్ లో పంపాలని కోరిన ఆయన ఇలా మీడియాకి లేఖలు విడుదల చేయడం తగదని, అలా చేస్తే, జరుగుతున్న విచారణకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఒక వేళ మీరు పంపే ఆధారాలు సరైనవే అయితే ఖచ్చితంగా అందుకు తగ్గ చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తికి, ఒక పండ్ల వ్యాపారికి మధ్య దారి విషయంలో వాగ్వాదం జరగ్గా రామచంద్ర అక్కడకు వెళ్లి వారిద్దరినీ ఆపే ప్రయత్నం చేశారని ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి, రామచంద్రపై దాడి చేశారని డీజీపీ వెల్లడించారు. ప్రతాప్ రెడ్డి టీడీపీ కార్యకర్త అని తేలిందన్న ఆయన ఈ కేసులో వైసీపీ నేతలు పథకం ప్రకారం దాడి చేశారనే ఆరోపణలు అవాస్తవమని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version