ధనుష్ తో విడాకులపై తొలిసారి స్పందించిన ఐశ్వర్య రజినీకాంత్

-

సినీ పరిశ్రమలో నాగచైతన్య- సమంత విడాకుల అంశం చాలా చర్చనీయాంశం అయింది. దీని తర్వాత  అంతటి సంచలన కలిగించింది ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల అంశమే. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇద్దరు విడాకులు తీసుకోవడం వారి అభిమానులను షాక్ గురిచేసింది. తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు ఈ స్టార్ కపుల్స్. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధానికి విడాకులు ఇచ్చారు. ధనుష్-ఐశ్వర్యకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  అయితే వీరి విడాకులకు ఏం కారణమైందనే అంశంపై నెటిజెన్లు తెగకామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. విడాకులు తీసుకున్న తరువాత తొలిసారిగా ఐశ్వర్య దీనిపై స్పందించారు. ఆమె తొలిసారిగా  మీడియాతో మాట్లాడారు. జీవితంలో ఏదో ఒక టైంలో ప్రతీఒక్కరికి ఆటుపోట్లు ఎదురవుతాయని.. వాటిని తప్పకుండా ఎదుర్కొోవాలిని ఆమె అన్నారు. ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ అని… దానికి వ్యక్తిగత అంశాలతో సంబంధం లేదని పేర్కొంది. తాను ఎదిగే కొద్దీ ప్రేమ నిర్వచనం మారుతోందని తెలిపింది. పిల్లలు, అమ్మ, నాన్నలను ప్రేమిస్తానంది. అయితే ధనుష్ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు ఐశ్వర్య.

Read more RELATED
Recommended to you

Latest news