రేవంత్ రెడ్డి ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయిన ఇచ్చారా? : కేటీఆర్

-

పట్టభద్రుల తరఫున మీరు పట్టం కట్టే వ్యక్తి బ్లాక్మెయిల్ రాజకీయాలు, బూతు పురాణం మాట్లాడే వ్యక్తి ఉండాలా? మీరే నిర్ణయించుకోండి” అని ప్రజలకు ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలు చేశారు.

 

శాసనమండలికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.ఇందులో భాగంగా ఖమ్మం ఎస్బీఐటీ కాలేజీలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ… ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలని, అది రాకేశ్ రెడ్డితోనే సాధ్యమని కేటీఆర్ అన్నారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కనీసం ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని గల్లాపట్టి అడిగే వ్యక్తి రాకేశ్ రెడ్డి అని పేర్కొన్నారు. .ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 2 లక్షల ఉద్యోగాల గురించి రాకేశ్ రెడ్డి పోరాడతారని ,సమాజంలో మంచికంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. సోషల్ మీడియాలో మంచి మాటలు చెప్పే రాకేశ్ రెడ్డి లాంటి వ్యక్తి మాటలు ఎవరు చూడరని, తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి బూతులు మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version