అడవి జంతువు అనుకుని మనిషిని కాల్చారా…? ఏదో తేడాగా ఉంది…!

-

విశాఖ ఏజెన్సీలో నాటు తుపాకి కాల్పుల కలకలం రేపింది. అరకు ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం గదబగలుగు గ్రామస్తులు నాటు తుపాకిలతో వేటకి వెళ్ళారు. అయితే అడవి జంతువు అనుకుని వేటకు వెళ్ళిన వ్యక్తులు కాల్పులు జరిపారు. రెండు రౌండ్ లు కాల్పులు జరపగా తాంగుల బలరాం అనే వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న డుంబ్రిగుడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే కాల్పుల ఘటనపై అనుమానాలు వస్తున్నాయి. మనిషికి వన్యప్రాణికి తేడా ఉంటుందని, స్పష్టంగా తెలియకుండా ఏ విధంగా కాలుస్తారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. వేటకు వెళ్ళిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news