ప్రొడ్యూసర్ దిల్ రాజు గట్టిగా ఇరుక్కొని పోయాడా..!!

-

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు దారుణ మైన దెబ్బ పడబోతుందా అంటే అవుననే అంటున్నాయి  కోలీవుడ్ మరియు టాలీవుడ్  వర్గాలు. ఎన్నిరోజులగా కోలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న దిల్ రాజు స్టార్ హీరో దళపతి విజయ్ డేట్స్ సంపాదించి , మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్నారు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

హీరో విజయ్ కి వున్న  రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా  జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది. ఇప్పటికే సినిమా ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దిల్ రాజు కూడా తన పద్దతికి విరుద్ధంగా సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట.అయితే ఇప్పుడు ఈ సినిమాకు కోలీవుడ్ లో  మరియు టాలీవుడ్ లో ఇబ్బందులు ఎదురు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కోలీవుడ్ లో విజయ్ `వారీసు` రిలీజ్  కానున్న  జనవరి 12నే తల అజిత్ నటిస్తున్న `తునీవు` కూడా రిలీజ్ కాబోతోందట. ఇక ఈ సినిమా కు ఎక్కువ థియేటర్స్ లభించే అవకాశం ఉందట. అలాగే టాలీవుడ్ కు వస్తే సంక్రాంతి కి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య బాబు ల వీర సింహ రెడ్డి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.మధ్యలో షూటింగ్లు బంద్ అయినప్పుడు వారసుడు ను దిల్ రాజు తమిళ సినిమా గా చెప్పుకున్నాడు. ఇప్పుడు అవే కామెంట్స్  తనకు గుది బండ గా మారాయి. సంక్రాంతి కి డబ్బింగ్ సినిమా కు థియేటర్లు ఇవ్వొద్దని, స్ట్రెయిట్ సినిమాలకే ఇవ్వాలని దిల్ రాజు వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోందట. దీనితో రెండు రాష్ట్రాలలో దిల్ రాజు సినిమా కు దబిడి దిబిడే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news