పొట్ట కూటి కోసం దుబాయ్ వెళ్లి లాటరీలో 20 కోట్లు కొట్టాడు…!

-

అద్రుష్టం కొంత మందిని అలా పలకరిస్తూ ఉంటుంది. ఏమీ లేని వాళ్లకు కోట్లు వచ్చి పడుతూ ఉంటాయి. పెళ్లి అవ్వదు అనుకున్న వాడికి కూడా అందమైన అమ్మాయి వస్తుంది. తాజాగా ఇలాంటి విషయమే ఒకటి వెలుగులోకి వచ్చింది. పొట్ట కూటి కోసం దుబాయ్ వెళ్లి కోటీశ్వరుడు అయ్యాడు ఒక వ్యక్తి. రాత్రికి రాత్రే 20 కోట్లు సంపాదించాడు. కేరళకు చెందిన దిలీప్ కుమార్ అనే యువకుడు…

మన దేశంలో ఉంటే కష్టం, ఉద్యోగం దొరకదు అనుకుని ఉపాధికోసం యూఏఈ వెళ్లి… అజ్మన్ నగరంలో ఓ సంస్థలో సేల్స్ మెన్ గా జాయిన్ అయ్యాడు. దిలీప్ కుమార్ ఒక రోజు అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 దిర్హామ్ లు వెచ్చించి ఒక లాటరీ కొనుగోలు చేసాడు. ప్రతీ నేలా మూడో తేదీన దానికి సంబంధించిన లాటరీ తీస్తూ ఉంటారు.

ఇలా లాటరీ తీయగా ఈసారి మూడో తేదీన లాటరీలో రూ.20 కోట్ల రూపాయల లాటరీ దిలీప్ కుమార్ కి తగిలింది. దీని గురించి మాట్లాడిన అతను 17 ఏళ్లుగా అజ్మన్ నగరంలో ఉంటున్నానని, తనకు వచ్చిన లాటరీలోని కొంతభాగం బ్యాంక్ అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బుతో పిల్లలకు చదువు చెప్పిస్తానని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news