Breaking : ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు కరోనా

-

కరోనా రక్కసి ఎవరినీ వదలడం లేదు. ఇటీవల కరోనా బారినపడిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన భార్య, నటి సుహాసిని త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మణి రత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ నెల 8న నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచింగ్‌కు మణిరత్నం ఇటీవల హాజరయ్యారు. ఇదే సినిమా పోస్టుప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్న ఆయనకు ఇటీవల కొవిడ్ సోకింది.

ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సంబంధించిన వివరాలను వైద్యులు కూడా వెల్లడించలేదు. దీంతో.. ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా పాన్‌ ఇండియా లెవెల్లో చిత్రికరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్‌, త్రిష, కార్తీ, చియాన్‌ విక్రమ్‌లతో పాటు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version