ఫైనల్ కు వెళ్ళేది సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లే : డివిలియర్స్

-

ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. సెమిఫైనల్ లో ఇప్పుడు ఇండియా, సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా లు ఉండగా, అనధికారికంగా న్యూజిలాండ్ కూడా నాలుగవ జట్టుగా జాయిన్ అయినట్లే. కానీ కాసేపటి తర్వాత ఇంగ్లాండ్ పాక్ మ్యాచ్ అనంతరం అధికారికంగా కివీస్ సెమీస్ చేరనుంది. కాగా సెమీఫైనల్ మ్యాచ్ ల గురించి సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. డివిలియర్స్ సోషల్ మీడియా వేదికగా, మొదటి సెమీఫైనల్ లో ఇండియా కివీస్ లు పోటీ పడితే విలియమ్సన్ సేన ఫైనల్ కు చేరుతుంది. అదే విధంగా ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన జరగనున్న రెండవ సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది.

ఇక చివరి సమరానికి సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ లు అర్హత సాధిస్తాయి అని తన అంచనాను తెలియచేశారు. మరి డివిలియర్స్ చెప్పినట్లు జరుగుతుందా ? లేదా అన్నది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news