దివ్య హత్య కేసు నిందితుడుకి పోలీసుల సమక్షంలో వైద్య పరిక్షలు…!

-

జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న విజయవాడ దివ్య తేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబుని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనేది క్లారిటీ రావడం లేదు. 13 రోజుల చికిత్స అనంతరం నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు… ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది చెప్పడం లేదు. ఆపరేషన్ చేసిన పొట్టలోని అవయవాల పని తీరును తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తున్నారు.

పోలీసుల బందోబస్తు మధ్య నాగేంద్రబాబు కు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా అతని అరెస్ట్ విషయంలో ఏ స్పష్టత విజయవాడ పోలీసులు ఇవ్వడం లేదు. అతనిపై కేసులు నమోదు చేసారు అధికారులు. అయితే వైద్యులు మాత్రం డిశ్చార్జ్ చేసే విషయంలో ఇప్పట్లో ఏమీ చెప్పలేమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version