రెచ్చిపోయిన దొంగలు.. ఎంత దోచేశారో తెలుసా..!

-

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది అన్న విషయం తెలిసిందే. ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. తాళం వేసి ఉన్న ఇళ్లు కనిపించాయి అంటే చాలు ఇక గుళ్ల చేస్తున్నారు ఎంతో మంది దొంగలు. అందినకాడికి దోచుకో పోతున్నారు ఇక్కడ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు.

కౌడిపల్లి మండలం బుజిరం పేట గ్రామంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయి గ్రామానికి చెందిన నాయి కోటి పెద్ద లింగం ఇంట్లో భారీ దొంగతనానికి పాల్పడ్డారు. కుటుంబం మొత్తం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న మూడున్నర లక్షల నగదు 70 తులాల వెండి మూడున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో షాక్ అయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version