శివాజీ సినిమాలో కనిపించిన అక్కాచెల్లెళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

-

సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం శివాజీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం ఇది. ఈ సినిమా రజినీకాంత్ విదేశాల నుండి ఇండియాకు వచ్చిన ఎన్నారై గా కనిపించారు. ఈ సినిమా 2007లో విడుదలై పేను సంచలన విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ గా శ్రియ నటించింది.ఈమె అచ్చ తెలుగు సాంప్రదాయ అమ్మాయిలగా నటించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు.

అలాగే ఈ సినిమాలో అక్కమ్మ ,జక్కమ్మలు.. కాస్త అంద విహీనంగా నటించడం జరిగింది. వీరిని చూసిన రజినీకాంత్ రియాక్షన్ ప్రతి ఒక్కరిని నవ్వేలా చేస్తూ ఉంటుంది. ఇక సినిమా ఫస్ట్ స్టాప్ లో కనిపించే ఈ అమ్మాయిలు అప్పట్లో చాలా ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో వారిని చూసిన వారంతా వీరు బయట కూడా ఇలాగే ఉంటారా అని అనుకున్నారు. కానీ ఈ అమ్మాయిలు బయట మాత్రం మరొక లాగా ఉంటారని చెప్పవచ్చు. ఇక వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వాటి గురించి తెలుసుకుందాం.


వీరి అసలు పేరు సంఘవై,అంగవై.. తాజాగా వీరి ఫోటోలు వైరల్ కావడంతో వీరిని చూసిన ప్రేక్షకులు సైతం ఇంత అందంగా ఉన్నారా అంటు ఆశ్చర్యపోతున్నారు. ఇక శివాజీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించడం ప్లస్ గా మారిందని చెప్పవచ్చు. శివాజీ సినిమా రికార్డు స్థాయిలో అప్పట్లో రూ. 15 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక తర్వాత శంకర్ రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన రోబో, రోబో2.O చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news