‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’… హర్మన్‌ప్రీత్‌

-

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నెలలో అద్భుతంగా రాణించింది.

ఇంగ్లాండ్ పర్యటనలో 3 వన్డేల్లో 74 నాటౌట్, 143 పరుగులతో చెలరేగింది. ఆఖరి వన్డేలో 4 పరుగులు చేసినప్పటికీ క్లీన్ స్వీప్ చేసింది. ఆమె అసాధారణ ఆటతీరుతో 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై భారత్ అమ్మాయిలు సిరీస్ గెలిచారు. కాగా, ఆసియా కప్‌ లో భాగంగా.. ఇవాళ భారత మహిళల జట్టు.. దక్షిణాఫ్రికాతో ఆడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news