ఆవుపేడను మొబైల్ ఫోన్స్ లో వాడతారా…?

-

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో విషయాలు ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆవు పేడ విషయంలో కొందరు చేస్తున్న విస్మయకర వ్యాఖ్యలు ప్రజలను షాక్ కి గురి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి తరహా వ్యాఖ్యలే ఒకరు చేసారు. రాష్ట్రీయ కామ్ధేను ఆయోగ్ చైర్మన్ వల్లభాయ్ కాతిరియా నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

వారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే… ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది అని చెప్పారు. ఇది రేడియేషన్ కు వ్యతిరేకంగా పని చేస్తుంది అన్నారు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది అని చెప్పారు. అంతే కాదు… ఇది రేడియేషన్ చిప్ అని చెప్పారు. ఇది రేడియేషన్ తగ్గించడానికి మొబైల్ ఫోన్లలో ఉపయోగించబడుతుందని అన్నారు. ఇది వ్యాధుల నుండి రక్షణగా ఉంటుందని సెలవిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version