డాక్టర్ ని కిడ్నాప్ చేయించింది బంధువే.. వాటి కోసమే ?

-

రాజేంద్రనగర్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ హుస్సేన్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్న ఆయన బంధువు ముస్తఫా కిడ్నాప్ చేయించినట్టు చెబుతున్నారు. డాక్టర్ హుస్సేన్ ఇంటి పైన కిరాయి కి వుండే ఖలీద్ అనే వ్యక్తి ద్వారా ఈ కిడ్నాప్ చేయించాడని అంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ముస్తఫా డాక్టర్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ చేశాడు. అనుకున్నట్టుగానే కిడ్నాప్ చేసేందుకు కొంత మందిని మాట్లాడుకొని హుస్సేన్ ను కిడ్నాప్ కూడా చేయించాడు.

అలా కిడ్నాప్ చేశాక వాట్సాప్ కాల్ చేసి హుస్సేన్ కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్ చేశారు. ఆ డబ్బులు కూడా బిట్ కాయిన్ రూపంలో కావాలంటూ డిమాండ్ చేశారు. ఆ ఆ నెంబర్ ఆధారంగా వెహికిల్ ని ట్రెస్ చేసి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. వెంటనే అలర్ట్ అయిన ఏపీ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేసి డాక్టర్ ను సేవ్ చేశారు. తెల్లవారుజామున అనంతపురం పోలీసులు డాక్టర్ హుస్సేన్ ని సేఫ్ గా కాపాడారు. డాక్టర్ హుస్సేన్ ఇంటిపైన కిరాయికి ఉండే ఖలీద్ ను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించగా ఈ కిడ్నాప్ ఉదంతం బయటపడింది. దీనికి సంబంధించి మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news