ఢిల్లీ పోలీసులకు సవాల్ అయిన డబుల్ మర్డర్

-

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన డబుల్ మర్డర్ ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రేటర్ నోయిడాలోని చెర్రీ కౌంటీ సొసైటీలో ఈ హత్యలు జరిగాయి. తొమ్మిదవ అంతస్తులోని ఫ్లాట్‌ లో కిరాణా షాపు యజమాని మరియు అతని భార్య మృతదేహాలను రక్తపు మడుగులో పోలీసులు గుర్తించారు. బుధవారం ఈ హత్యలు జరిగాయి అని అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటన బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మరణించిన దంపతులు వినయ్ గుప్తా, నేహా గుప్తా కొన్ని నెలల క్రితం ఈ ఫ్లాట్‌ కు మకాం మార్చారు అని, కిరాణా షాపు ఉండటంతో వారు ఇక్కడ నివాసం ఉంటున్నారు అని అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) లవ్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు… స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌, ఫోరెన్సిక్‌, నిఘా విభాగాల అధికారులు స్థలాన్ని పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దింపారు. అయితే సాక్ష్యాలు దొరకకపోవడంతో స్థానికులను విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version