ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు ఆత్మహత్య!

-

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు అయిన మజారుద్దీన్ అలీఖాన్ (60) ఆత్మహత్య చేసుకున్నాడు. ఓవైసీ ఆసుపత్రిలో వైద్యుడుగా ఎంపీ అసదుద్దీన్ వియ్యంకుడు మజారుద్దీన్ అలీఖాన్ పని చేస్తున్నారు. అయితే.. నిన్న ఉదయం 10. 15నిమిషాలకు ఇంట్లోని బెడ్రూమ్ లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మజారుద్దీన్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లోనే భార్య ఉంది. పేలుడు శబ్దాలు రావడంతో బెడ్రూమ్ లోకి వెళ్లాడు మజారుద్దీన్ వ్యక్తిగత కార్యదర్శి తాజుద్దీన్. రక్తపు మడుగులో ఉన్న మజారుద్దీన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించాడు తాజుద్దీన్. ఇక ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయాడు మజారుద్దీన్. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణం అంటున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.. చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version