థ్రిల్ల‌ర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి ‘దృశ్యం-3’

-

దృశ్యం సిరీస్.. అంటే మళయాలం ప్రేక్షకులే కాకుండా.. తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం. అయితే.. తాజాగా ఈ సిరీస్ లో భాగంగా మూడో పార్ట్ సిద్దమవుతోందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూడో భాగాన్ని రూపొందించే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో దర్శకుడు జీతూజోసెఫ్ చెప్పారు. అయితే ఇప్పుడా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్మాత అంటోనీ పెరుంబవూర్. రీసెంట్ గా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో దృశ్యం-3 తెరకెక్కబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

మలయాళం లో జీతూజోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం సినిమా, తెలుగు, తమిళం తో పాటు హిందీలోనూ పునర్నిర్మితం అవుతూ ప్రేక్షకుల్ని మెప్పించాయి. మలయాళం లో మోహన్ లాల్ నటించగా, తెలుగులో విక్టరీ వెంకటేష్, తమిళంలో కమలహాసన్, హిందీలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు. అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ కథలు ఇవి.

కథానాయకుడు తన సినిమా తెలివితేటలని ఉపయోగిస్తూ పోలీసుల చేతికి దొరక్కుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ రావడమే ఈ కథ. కాగా, ఇటీవల దృశ్యం-3 కు సంబంధించిన ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టర్ లో మోహన్ లాల్ సంకెళ్లతో కనిపించారు. మరి ఈసారి మూడో భాగంలో కథానాయకుడు పోలీసులకి దొరికాడా లేక తప్పించుకున్నాడా? అనేది ఆసక్తి కరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version