వారిని చీపుర్లతో కొట్టి తరిమేయండి : హరీష్ రావు

-

రాష్ట్రవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులను చీపుర్లతో కొట్టి తరిమేయండి అని మహిళలకు పిలుపునిచ్చారు.గురువారం మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఆరు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. ఎక్కడ అమలయ్యాయో చూపించాలని హరీష్ రావు సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ అయిన రైతులంతా కాంగ్రెస్‌కే ఓటేయండి అని ,రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్‌కు ఓటేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగి రైతులంతా కన్నీరు పెట్టుకునే పరిస్థితులు దాపురించాయని.. వీటిని పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచులు, పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాడని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలంటే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version