సీఎస్కే జట్టుకి కెప్టెన్ గా డూప్లిసెస్..?

-

ఐపీఎల్ 2020 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా చెన్నై జట్టు నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి క్రికెట్ కనెక్టెడ్ అనే కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యొక్క సారధ్య బాధ్యతలను డుప్లెసిస్ కి అప్పగించే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అటు వెంటనే మాట్లాడినా ఇర్ఫాన్ పఠాన్… మరికొన్ని నెలల సమయం మాత్రమే నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడానికి సమయం ఉన్న నేపథ్యంలో ధోని పూర్తిస్థాయి ఫిట్నెస్ తో తిరిగి వస్తాడని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు . ధోని గొప్ప ఆటగాడు కాబట్టే మళ్ళీ అతని మైదానంలో చూడాలని అనుకుంటున్నాను అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version