డెంగీ జ్వరం రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం..

-

డెంగీ అనేది ఒక వైరస్. ‘ఈడిస్ ఈజిప్టై’ అనే ఒక రకం ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. కంటికి కూడా అంతగా కనిపించని దోమ మన ఒంటికి చేసే కీడు అంతా ఇంతా కాదు. మన రక్తం పీల్చి అది బతికేస్తూనే.. మన ప్రాణాలను మాత్రం ప్రమాదంలోకి నెట్టేస్తోంది. పగటిపూట ఈ దోమ కుడితే కొద్ది రోజుల్లోనే డెంగీ బారిన పడతాం. ఇది జ్వ‌రంతో ప్రారంభ‌మై ఒక్కోసారి ప్రాణాలు తీసే వ‌ర‌కు వెళ్తుంది.

Eat these 7 foods to recover from dengue fever faster
Eat these 7 foods to recover from dengue fever faster

పరిసరాల పరిశుభ్రత, ముందు జాగ్రత్తలతో ఈ వ్యాధికి చెక్‌ చెప్పొచ్చు. అలాగే డెంగీ రావడం వల్ల‌ శరీరంలో ఫ్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఈ క్ర‌మంలోనే అధిక నొప్పులు వ‌స్తుంటాయి. ఎన్నో ఇబ్బందులు పాడాల్సి వ‌స్తుంది. ఇలాంటి స‌మ‌యంలో కొన్ని ర‌కాల ఆహార జాగ్ర‌త్త‌లు తీసుకుంటే డెంగ్యూకు చెక్ పెట్ట‌వ‌చ్చు. అవేంటో ఓ లుక్కేయండి..

– డెంగీతో బాధ‌ప‌డుతున్న వారికి దానిమ్మ‌, కివీ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తినాలి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌నుపెంచ‌డానికి స‌హాయం చేస్తుంది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతాయి.

– రెండు తాజా బొప్పాయి ఆకులను తీసుకొని, వాటి నుండి జ్యూసును తీసి, ప్రతి రోజూ ఉదయం మరియు రాత్రి రెండు చెంచాల జ్యూస్ ను డెంగ్యూ రోగికి ఇచ్చినట్లైతే రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది.

– డెంగీ ఫీవర్ తో బాధ‌ప‌డుతున్న వారు ఎక్కువగా కొబ్బరి బోండాం నీళ్లు తాగితే మంచిది. కొబ్బరి నీళ్ళు శరీరం ద్వారా కోల్పోయిన ఎలెక్ట్రోలైట్స్ మరియు ఇతర ట్రేస్ మినిరల్స్ అందించి శరీరంను డీహైడ్రేషన్ నుండి ర‌క్షిస్తుంది.

– డెంగీ ఫీవర్ తో పోరాడుతున్న‌ వారు నేచురల్ హెర్బల్ టీ తాగడం చాలా మంచిది. ఈ హేర్బల్ టీ అల్లం మరియు యాలకులతో తయారు చేయబడి ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.

– వేపతో త‌యారు చేసిన ర‌సాన్ని డెంగ్యూ రోగి తాగ‌డం వ‌ల్ల చాలా మంచిది. శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచ‌డంతో పాటు రోగనిరోధక శక్తి కూడ పెరుగుతుంది. వ్యాధి నివార‌ణ‌కు బాగా స‌హాయ‌ప‌డుతుంది.

– ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. యూరినరీ అవుట్ పుట్ ను మెరుగుపరిచి యాంటీబాడీస్ ప్రోత్సహించి రోగి త్వరగా కోలుకొనేందుకు సహాయపడుతుంది. డెంగీ రోగికి ఒక మంచి ఆహారం సిట్రస్ పండ్లు.

– డెంగీ భారినపడిన వ్యక్తి శ‌రీరానికి కావాల్సిన నీరును త‌ప్ప‌ని స‌రిగా తాగాలి. అప్పుడే శ‌రీరంలోని వ్య‌ర్థ‌ప‌దార్దాలు బ‌య‌ట‌కు వెళ్లి ఆరోగ్యం కుదిట‌ప‌డుతుంది.

– కొత్తిమీర ఆకులతో జ్యూస్ తాగడం డెంగీ రోగికి చాలా మంచిది. కొత్తిమీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని బాక్టీరియాతో పోరాడగల శక్తి దీనికి పుష్క‌లంగా ఉంది.

– ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, పండ్లు ఎక్కువ‌గా తినాలి. ఆకు కూర‌లు తిన‌డం వ‌ల్ల రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో ప్లేట్ల‌ట్స్ అభివృద్ధి చెందుతాయి. డెండీ నివార‌ణ‌కు ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు గ్రేట్‌గా ప‌నిచేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news