ECI: లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటేసేందుకు 96.88 కోట్ల మంది రెఢీ

-

న్యూఢిల్లీ: ఇవాళ కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. భారత దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం భారీ సంఖ్య‌లో ఓట‌రు న‌మోదు జ‌రిగింది.ఎన్నిక‌ల్లో ఓటేసేందుకు దేశ‌వ్యాప్తంగా 96.88 కోట్ల మంది రిజిస్ట‌ర్ చేసుకున్న‌ట్లు ఈసీఐ ప్రకటించింది. కొత్తగా ఓటు రిజిస్టర్ చేసుకున్న వారిలో యువత, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు.

భార‌త ఎన్నిక‌ల సంఘం 2019తో పోలిస్తే ప్ర‌స్తుతం రిజిస్ట‌ర్ ఓట్ల సంఖ్య ఆరు శాతం పెరిగిన‌ట్లు తెలిపింది. 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసు ఉన్నవారు రెండు కోట్ల మంది యువత ఓటు నమోదు చేసుకున్నారు.ఈ సంవత్సరం అత్య‌ధిక సంఖ్య‌లో ఓటు న‌మోదు చేసుకున్న వారిలో పురుషుల క‌న్నా మ‌హిళ‌లే ఎక్కువ‌గా ఉన్నారు. 18 ఉంటే ఇప్పటికీ కూడాఓటు న‌మోదు చేసుకోని వారు ఇంకా త‌మ ఓటును న‌మోదు చేసుకునే అవ‌కాశం ఉందని ఈసీఐ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news