టీడీపీ మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు..

-

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై రెండు రోజుల నుంచి దాడులు జరిపిన తరువాత, నిధుల అక్రమ మళ్లింపుపై ప్రాథమిక సాక్ష్యాలను సేకరించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత రాయపాటి సాంబశివరావుపై కేసును రిజిస్టర్ చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. నిధుల మళ్లింపుపై రాయపాటి సాంబశివరావుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. రూ.16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాకి మళ్లించినట్లు గా ఈడీ గుర్తించింది. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే రాయిపాటితో పాటు కుమారుడు రామారావు, ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదైన విషయం తెలిసిందే.

అలాగే 15 బ్యాంకుల నుంచి రూ.8832 కోట్లు కంపెనీ రుణం తీసుకున్నది. రూ.3822 కోట్లు దారి మళ్లించినట్టు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. సింగపూర్‌, మలేషియా, రష్యాలకు నిధులు మళ్లించినట్టు అభియోగాలు ఉన్నాయి. మ‌రోవైపు .. సీబీఐ వచ్చినప్పుడు తాను కంపెనీలో లేనని.. తనిఖీలు చేసి ఏమీ లేదని సీబీఐ అధికారులు వెళ్లిపోయారని చెప్పిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని.. కంపెనీ వ్యవహారాలన్నీ సీఈవో చూసుకుంటున్నారని రాయపాటి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news