రానున్న ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజల మధ్య : ఈటల

-

రానున్న ఎన్నికల్లో తెలంగాణకు కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హల్ లో స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడుతూ….రానున్న ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజల మధ్య జరగబోతున్నాయని అన్నారు. ఘన్ పూర్ నియోజకవర్గంలో హుజురాబాద్ ఫలితాలే పునరావృతం అవుతాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సేవ్ ఎల్బీనగర్ పేరుతో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రావ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద 48గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష రెండవ రోజు గురువారం ఈటెల రాజేందర్ హాజరై సంఘీభావం తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version