బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు గల్లంతు ఖాయం : మంత్రి మల్లారెడ్డి

-

ముఖ్యమంత్రి కేసీఆర్ ‌ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీలో రూ.4 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు గురువారం ఆయన భూమి పూజ చేశారు. తూంకుంట, హకీంపేట, దేవరయాంజాల్‌ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్‌ దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు ఆకర్శితులై బీఆర్‌ఎస్‌ లోకి చేరుతున్నారని వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు డిపాజిట్లు గల్లంతేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

ఇది ఇలా ఉంటె , ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న దేశాభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి సర్కార్ ను గద్దె దింపేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ మహారాష్ట్ర జింతుర్ ఎమ్మెల్యే మేఘన సకోర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రవాస్ యోజన లో భాగంగా ఉమ్మడి మేడ్చల్ మండల బీజేపీ సమావేశం మేడ్చల్ లో నిర్వహించారు. అంతేకాకుండా మేడ్చల్ నియోజకవర్గం లో అనేక పార్కులను,చెరువులను మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని ఏ ఒక్క బీజేపీ కార్యకర్త కబ్జా చేసినట్లు నిరూపిస్తారని మంత్రి మల్లారెడ్డికి సవాల్ విసిరారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version