ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు

-

టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. అధికార పార్టీ నుండి అసంతృప్తులు ఒక్కరొకరిగా చేజారి పోతున్నారు.అటు రేవంత్ రెడ్డి, ఇటు బండి సంజయ్ అధికార పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సూచనలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version