తన మరణం పై ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్

-

ఎలన్ మస్క్ చేసే ట్వీట్లు తరచూ సంచలనంగా మారుతుంటాయి. తనదైన శైలిలో ట్విట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు మస్క్. ఉక్రెయిన్ కు మద్దతుగా పని చేయడం, అకస్మాత్తుగా ట్విట్టర్ ను కొనుగోలు చేయడం, త్వరలో కోకాకోలా ని హస్తగతం చేసుకుంటానని చెప్పడం ఈ కోవలోకే వస్తాయి. తాజాగా తన మరణం పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక వేళ అనుమానాస్పద స్థితిలో చనిపోవచ్చు అని ట్విట్ లో పేర్కొన్నారు. అయితే మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం అంటూ.. ట్విట్టర్లో ఆసక్తికర రీతిలో పోస్ట్ చేశారు. దీనికి గంట ముందు ఓ కీలక ట్వీట్ ను ఆయన షేర్ చేశారు.

ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్న ఆయనని ఉద్దేశిస్తూ రష్యా అధికారి నుంచి ఓ బెదిరింపు పోస్ట్ వచ్చింది.” ఉక్రెయిన్ లోని కమ్యూనికేషన్ సామాగ్రిని పంపించి, నాజీ దళాలకు సహకారం లో మీ భాగస్వామ్యం ఉంది. ఈ పరిణామానికి మీరు మూల్యం చెల్లించుకుంటారు.” అనే రష్యా అధికారి పంపిన మెసేజ్ ను మస్క్ కి షేర్ చేశారు. ఇక ప్రపంచ దేశాల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రముఖులను రష్యా లక్ష్యంగా చేసుకుని, వారిని హత్య చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ అనుమానాస్పద మృతి గా నమోదు అవుతుంటాయి. దీనిని ప్రస్తావిస్తూ ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news